Tirumala Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - నేడే అంకురార్పణ
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Tirumala Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలకు శ్రీకారం చుడుతూ. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 14) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో అంకురార్పణ ఘట్టాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఆగమశాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంలోని యాగశాలలో ఈ క్రతువును జరుపుతారు. ఏదైనా వైదిక ఉత్సవం లేదా యజ్ఞం సఫలంగా జరగడానికి ముందు అంకురార్పణ చేయడం అనివార్యమైన ఆచారం. ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని స్వామివారిని వేడుకుంటూ నవధాన్యాలను మొలకెత్తించడమే ఈ అంకురార్పణ వెనుక ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.