భారతదేశం, ఆగస్టు 18 -- సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఐదు రోజుల పాటు 'కారీరిష్టి యాగం', 'వరుణ జపం', అలాగే 'పర్జన్య శాంతి హోమం' వేడుకగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టీటీడీ ఈ విషయాలను వెల్లడించింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేదికగా ఈ ప్రత్యేక వైదిక క్రతువులు జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన 'మహా పూర్ణాహుతి' క్రతువును అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.

ఈ యాగంలో మొత్తం 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొని మంత్రోచ్ఛారణలతో హోమాలు జరుపుతారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ...