భారతదేశం, ఆగస్టు 5 -- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నీట్ యూజీ (NEET UG-2026) అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవడం ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు.

అభ్యర్థులు ప్రవేశాలకు సంబంధించి అధికారిక పోర్టల్ https://tsmedadm.tsche.in ను సందర్శించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను భర్...