భారతదేశం, మే 12 -- Telangana Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. మే 13 నుంచి జరిగే ఈ పరీక్షల కోసం.. ఇంటర్ బోర్డు ఏర్పాట్లను పూర్తి చేసింది. జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు మే 21 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది.

ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే (మొదటి సంవత్సరం వారు ఉదయం 8:00 కి, రెండో సంవత్సరం వారు మధ్యాహ్నం 1:30 కి) కేంద్రానికి చేరుకోవాలని అధ...