భారతదేశం, మార్చి 23 -- హాంకాంగ్‌కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ముడిపడి ఉన్న నాలుగు భారీ మోసాల కేసులకు సంబంధించి.. హైదరాబాద్ పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు. ఈ క్యూనెట్ కేసులో భాగంగా భారీగా మోసం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వ్యాప్తంగా సైబర్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ అరెస్టులు చేసింది.

విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, గోల్డ్ క్వెస్ట్, క్యూనెట్ అని కూడా పిలిచే క్యూఐ గ్రూప్ యాజమాన్యంలో ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సమావేశంలో తెలిపారు. ఆ కంపెనీ పైకి తనను తాను ఒక ఉత్పత్తి ఆధారిత వ్యాపారంగా ప్రదర్శించుకుంటున్నప్పటికీ, తెరవెనుక అక్రమ డబ్బు చలామణి పథకాన్ని నడుపుతోందని ఆరోపణలు ఉన్నాయి.

ఉపాధి కోరుకునే యువతతో పాటు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ...