భారతదేశం, ఏప్రిల్ 17 -- రైల్వే మంత్రిత్వ శాఖ రైలు సంఖ్య 17428/17427 నర్సాపూర్-తిరుపతి-నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు ఏప్రిల్ 27 నుండి ప్రారంభమవుతాయి. నర్సాపూర్-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 17428) ఏప్రిల్ 27 నుండి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి-నర్సాపూర్ రైలు (రైలు సంఖ్య 17427) మే 3, 2026 నుండి ప్రతి ఆదివారం రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుంది.

ఈ రెండు రైళ్లు రాకపోకల మార్గాల్లోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షి...