భారతదేశం, జూలై 2 -- తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్ 2026-27) సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే రవాణా, నిల్వ, ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించడానికి మిషన్ కే-100 పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అధికారికంగా ప్రారంభించింది.

పౌరసరఫరాల భవనంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జి.ఎన్. రాజుతో కలిసి ఈ సరికొత్త మిషన్‌ను లాంచ్ చేశారు. మిల్లుల్లో పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు తగిన గోదాములను కేటాయించాలని, అలాగే రాష్ట్రానికి రావలసిన పాత ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎఫ్‌సీఐని కమిషనర్ కోరారు.

మిషన్ కే-100 ప్రకారం.. కొత్త పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చేలోపు సరఫరా వ్య...