భారతదేశం, సెప్టెంబర్ 13 -- SCR Festival Special Trains : వినాయక చవిత వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ - హైదరాబాద్ డెక్కన్ మార్గంలో ప్రత్యేక పండుగ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14న ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వుడ్ ఏసీ ఛైర్ కార్, అన్‌రిజర్వుడ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. పండుగ పూట ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....