భారతదేశం, జనవరి 26 -- వేసవిలో ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ టూ కశ్మీర్ టూర్ ప్లాన్ చేసింది. 6 పగళ్లు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో చాలా ప్రాంతాలను కవర్ చేస్తారు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్(IRCTC) 13 మార్చి 2026న విశాఖ నుంచి టూర్ అందిస్తుంది. ఆరు రోజుల ఎయిర్ ప్యాకేజీ టూర్‌. మార్చి 13వ తేదీన ఉదయం 9 గంటలకు టూర్ మెుదలవుతుంది. మార్చి 18వ తేదీన రాత్రి 8:35 గంటలకు టూర్ ముగుస్తుంది.

విశాఖపట్నం విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. హోటల్‌కు చెక్-ఇన్ అవుతారు. భోజనం తర్వాత, షికారా రైడ్ (మీ స్వంత ఖర్చుతో). హోటల్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

హోటల్‌లో అల్పాహారం తర్వాత సోన్‌మార్గ్‌కు పూర్తి రోజు ప...