భారతదేశం, ఏప్రిల్ 4 -- హార్ముజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ క్షిపణులు గగనతలంలో దూసుకుపోతుంటే, మరోవైపు అమెరికా బాంబర్లు టెహ్రాన్‌పై దాడులు చేస్తున్నాయి. అయితే ఈ భీకర పోరు నడుమ ఇరాన్ దౌత్య కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సరికొత్త 'పరోక్ష యుద్ధాన్ని' సాగిస్తున్నాయి. తమదైన శైలిలో వ్యంగ్యాలు, చమత్కారాలతో అమెరికాను ఆటాడుకుంటున్నాయి.

తాజాగా జింబాబ్వేలోని ఇరాన్ మిషన్ ఈ సంక్షోభానికి ఓ వింత పరిష్కారాన్ని సూచించింది. "మర్యాదగా వ్యవహరించండి.. దారి తీసుకోండి" అని ఆ కార్యాలయం ట్వీట్ చేసింది. దీనికి ఫ్రాన్స్, స్పెయిన్ హ్యాష్ ట్యాగ్‌లను జత చేయడం గమనార్హం. అంటే శాంతియుతంగా చర్చలు జరుపుతున్న దేశాలకు తాము దారి ఇస్తున్నామనే సంకేతాలను ఇరాన్ పరోక్షంగా ఇచ్చింది.

నవ్వుపుట్టించేలా ఉన్నప్పటికీ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ము...