భారతదేశం, ఫిబ్రవరి 8 -- శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేస్తారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు.

రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భేరీ తాండవం ఉంటుంది.ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. శివదీక్షా భక్తులకు నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శ్రీమల్లికార్జునుడి స్పర్శ దర్శనం కల్పిస్తారు. ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎద...