తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈనెల 21న వస్త్రాల ఈ-వేలం, ఇలా పాల్గొనొచ్చు
భారతదేశం, సెప్టెంబర్ 13 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన కానుకల వేలానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం (E-Auction) ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ వేలం ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబరు 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగుతుంది. ఈ సారి వేలంలో ప్రధానంగా కొత్తవి అయిన ఆర్ట్ సిల్క్ చీరలను ఉంచారు. మొత్తం 132 లాట్లుగా వీటిని విభజించి ఆన్లైన్ వేలానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యాపారులు, భక్తులు, సాధారణ ప్రజలు ఈ-వేలంలో పాల్గొని తమకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు.
ఈ-వేలానికి సంబంధించిన మరింత సమాచారం, నిబంధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.