భారతదేశం, సెప్టెంబర్ 12 -- జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఆయనను న్యాయం, కర్మ, క్రమశిక్షణలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు తన రాశిని మార్చినా లేదా తన సంచార వేగంలో మార్పులు చేసుకున్నా.. ఆ ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై విభిన్న రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శని గ్రహం తిరోగమన స్థితిలో (వెనుకకు పయనించడం) సంచరిస్తోంది. రాశిచక్రంలోని పలు రాశుల వారికి ఈ గ్రహ స్థితి అత్యంత కీలకమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

శని తిరోగమన సంచారం రాబోయే డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. అంటే శని దేవుడి ప్రభావం ఈ రూపంలో మరో 90 రోజుల పాటు స్పష్టంగా ఉండబోతోంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. శని తిరోగమనంలో ఉన్న సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు, అసంపూర్తిగా వదిలేసిన అంశాలు మళ్లీ ముందరకు వస్తాయి. చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తున...