భారతదేశం, మార్చి 17 -- ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. విశాఖపట్నం - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును రెగ్యూలర్ సర్వీసుగా క్రమబద్ధీకరించారు. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నం - తిరుపతి( 08547/08548) మధ్య స్పెషల్ ట్రైన్ నడుస్తోంది. ఇకపై ఈ ట్రైన్ రెగ్యూలర్ ట్రైన్ గా సేవలు అందించనుంది. దీంతో ఈ ట్రైన్ నెంబర్ ను 18505/18506 గా మార్పు చేశారు.

విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18505) బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక తిరుపతి - విశాఖపట్నం(18506) మధ్య నడిచే ట్రైన్ గురువారం రాత్రి 21:50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు 13:30 నిమిషాలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.

ఈ రెగ్యూలర్ ట్రైన్.. అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకో...