భారతదేశం, ఆగస్టు 23 -- ఏపీతో నార్త్ ఇండియాకు కనెక్టివిటీ పెంచేలా సరికొత్తగా నాలుగు వరుసల హైస్పీడ్‌ రోడ్‌ నిర్మించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ నుండి ప్రారంభమై మన రాష్ట్రంలోని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించతలపెట్టిన 4 వరుసల హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ (AAC) ఆమోదముద్ర వేసింది. ఏపీ పరిధిలోని ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించినట్టుగా పేర్కొంది.

నాలుగు రాష్ట్రాల గుండా సాగే ఈ మెగా ప్రాజెక్టు మొత్తం పొడవు 1,107 కిలోమీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే అత్యధికంగా 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రూట్‌ను కేంద్రం యధాతథంగా ఆమోదించింది. పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ...