భారతదేశం, సెప్టెంబర్ 12 -- Zee5 OTT Re Launch By New AI Features With 5 Categories: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓటీటీ వినియోగం సరికొత్త ఎత్తులకు చేరుతోంది. డిజిటల్ మీడియా పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రముఖ వీడియా స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' (ZEE5) తమ ప్లాట్‌ఫామ్‌ను అత్యాధునికంగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లకు డిజిటల్ వినోదాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను జోడించి ప్లాట్‌ఫారమ్‌ను సంస్కరించింది.

స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లలో ఒకే రకమైన వీక్షణ అనుభవాన్ని అందించడమే కాకుండా, యూజర్లు కోరుకునే కంటెంట్‌ను క్షణాల్లో గుర్తించేలా నావిగేషన్ వ్యవస్థను తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచులను విశ్లేషించి, నిపుణులతో 'బగ్‌థాన్స్' నిర్వహించిన తర్వాతే ఈ మార్పులను అమల్లోకి తెచ్చారు.

ఈ అప్‌డే...