భారతదేశం, మార్చి 9 -- ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మ‌హిళాభ్యుద‌యానికి, మ‌హిళా సాధికార‌త‌కు చంద్ర‌బాబు పాల‌న చీక‌టి కాలమని చెప్పారు. రాష్ట్రంలో న‌డుస్తున్న‌దంతా దుశ్శాస‌న ప‌ర్వమంటూ ఆక్షేపించారు.

"నేరుగా సీఎం చంద్రబాబు గారిని అడుగుతున్నా.. అయ్యా! జ‌నాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మ‌ల‌కు ఎన్నిక‌ల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. కానీ అన్నీ చేసేసిన‌ట్లు విజ‌య‌వాడ‌లో , అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా, ప‌ట్ట‌ప‌గ‌లు ఇంకో డ్రామా మొద‌లు పెట్టిన మిమ్మ‌ల్ని నేరుగా అడుగుతున్నా.. మ‌హిళా సాధికార‌త అన్న ప‌దం ప‌లికే అర్హ‌త మీకుందా..?" అని జగన్ ప్రశ్నించారు.

Published by HT Digital Content...