భారతదేశం, మే 24 -- YS Jagan On CM Chandrababu : కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులపై అణచివేత చర్యలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నియంతలా మారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పూర్తిగా 'పోలీసు రాజ్యం' నడుస్తోందని దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లె గ్రామంలో తీవ్ర అన్యాయానికి గురైన కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ముఖ్య నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ సీనియర్ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహ...