భారతదేశం, జూన్ 18 -- ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేయడం ద్వారా యోగాను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక ధ్యాస పెట్టేలా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనే సాధకులకు, ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ...