భారతదేశం, మార్చి 23 -- 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంపై స్పందించిన ఆయన. తన సొంత ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చారని చెప్పారు. అయిన వాళ్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆ దేవుడి దయ వల్ల.. జగన్‌ 2029లో కచ్చితంగా సీఎం అవుతారని చెప్పుకొచ్చారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లిని తీసుకొచ్చి నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి చనిపోయినా ఆ ఆస్తిలో వాటా ఇచ్చే అన్నదమ్ములు ఉండాలి. కానీ తన సొంత ఆస్తిలో కూడా జగన్ వాటా ఇచ్చారు. చెల్లి ఎన్ని విమర్శలు చేసినా. చెల్లి కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మానవత్వం ఉన్న వ్యక్తి జగన్" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ...