భారతదేశం, ఆగస్టు 6 -- తెలంగాణలోని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త తెల్ల రేషన్ కార్డుల (White Ration Cards) జారీ ప్రక్రియకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను అర్హులకు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ పంపిణీ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని అర్హులకు కొత్త కార్డులను పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయం...