భారతదేశం, ఫిబ్రవరి 26 -- బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వెండితెరపైనే కాదు, వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. అజయ్ దేవగన్ సొంత ప్రీమియం విస్కీ బ్రాండ్ 'ది గ్లెన్ జర్నీస్' (The GlenJourneys) అతి తక్కువ కాలంలోనే ఊహించని మైలు రాయిని అందుకుంది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్‌లోకి ప్రవేశించిన అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రూ. 4.14 కోట్ల టర్నోవర్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అజయ్ దేవగన్, కార్టెల్ బ్రదర్స్ భాగస్వామ్యంలో రూపొందిన ఈ సింగిల్ మాల్ట్ విస్కీ బ్రాండ్ ఇప్పటివరకు 8,622 బాటిళ్లకు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో సుమారు 437 రిటైల్ అవుట్‌లెట్లలో ఈ బ్రాండ్ అందుబాటులో ఉంది.

మహారాష్ట్రలో ప్రారంభమైన 'ది గ్లెన్ జర్నీస్' విస్కీ ప్రయాణం.. గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర...