భారతదేశం, ఆగస్టు 13 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే వారం రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు, తరచుగా మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆగస్టు 18 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణ ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రజలు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.

ఆగస్టు 12, 13 కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గ...