భారతదేశం, మార్చి 26 -- ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం పురాతన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినది. ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టితమై ఉండటంతో ఒంటిమిట్టను "ఏకశిలా నగరం"గా కూడా పిలుస్తారు.
నేటి(మార్చి 26 ) నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.