భారతదేశం, మార్చి 3 -- శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈనెల 27వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 26వ తేదీన అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది.

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై సోమవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం, కళ్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ.... గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారులను ఆదేశించారు.

క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క...