భారతదేశం, జూలై 12 -- Visakhapatnam Earthquake : విశాఖపట్నం నగర ప్రజలు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం సుమారు 5:08 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న పలువురు స్థానికులు ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడంతో కంగారుగా రోడ్లపైకి పరుగులు తీశారు. తీరప్రాంత పరిసరాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కాస్త స్పష్టంగా కనిపించింది.

ఈ ప్రకంపనలకు సంబంధించి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) కీలక నివేదికను విడుదల చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్ర...