Vijayawada : విజయవాడ బస్టాండ్లో షాకింగ్ ఘటన - బ్యాగ్లో పేలుడు పదార్థాలు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్ పొరపాటున మరో ప్రయాణికుడి వద్దకు మారిన (బాగేజ్ మిక్స్-అప్) ఘటనలో.. దాదాపు ఐదు కిలోల బరువు కలిగిన 46 జిలెటిన్ స్టిక్స్ ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్న ఒక ప్రయాణికుడు తన ప్రయాణం ముగించుకుని, తన బ్యాగ్ అనుకుని పొరపాటున వేరొకరి బ్యాగ్ను తీసుకున్నాడు. అయితే అది తన బ్యాగ్ కాదని సదరు ప్రయాణికుడు త్వరగానే గుర్తించాడు. కానీ ఆ సంచిలో జిలెటిన్ స్టిక్స్ గానీ, ఎలాంటి ఇతర ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని గానీ ఆయన ఊహిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.