భారతదేశం, ఆగస్టు 29 -- Vijayasai Reddy Open Letter : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు, అధికార సమీకరణాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ వల్ల తనకు జరిగిన అవమానాలు, పార్టీ వీడటానికి గల కారణాలను ఆయన ఐదు పేజీల లేఖలో సమగ్రంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై "నమ్మకద్రోహి" అని వైసీపీ కోటరీ చేస్తున్న దుష్ప్రచారానికి ఈ లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

"నేను నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లలో నా పేరు లేకుండా చేసుకునేవాడిని" అని విజయసాయిరెడ్డి తన లేఖలో వ్యాఖ్యానించారు. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఆయనతో పాటు ప్రతి ఛార్జ్‌షీట్‌లో తనను ఎ-2గా చేర్చారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉంటే, తాను కూడా 15 నెలలు జైలు జీ...