భారతదేశం, మార్చి 3 -- ఇటీవల పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు విజయ్ సొంతూరు అయిన తుమ్మనపేటలో(నాగర్ కర్నూల్ జిల్లా) సందడి చేశారు. సోమవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.

పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ దంపతులకు గ్రామస్తులు కొత్త దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ. సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

పెళ్లి చేసుకున్న శుభ సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్ షిప్స్ ప్రకటించారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేస్తామని వెల్లడించారు.

"మన గ్రామా...