భారతదేశం, మే 3 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్‌డ్‌ రైస్‌లో ఉదయం సెషన్‌లో 21 లాట్లు, మధ్యాహ్నం సెషన్‌లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని ఈ-వేలంలో ఉంచనున్నారు.

ఈ వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల వారు ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లకు విడివిడిగా మే 13వ తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429. అలాగే టీటీడీ వెబ్‌సైట్‌ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ ని...