భారతదేశం, జూన్ 10 -- TTD Lord Venkateswara temple in Assam : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించాలనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పం వేగంగా సాకారం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం, సూచనల మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా ఈశాన్య భారత గేట్‌వేగా పిలిచే అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారులు మంగళవారం అధికారికంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన సోనాపూర్ సర్కిల్ పరిధిలో ఈ చారిత్రాత్మక భూమి కేటాయింపు జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంతంలో శ్రీనివాసుడికి సర్వాంగ ...