భారతదేశం, మార్చి 1 -- చంద్రగ్రహణం కారణంగా తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టీటీడీ స్థానికాలయాలను మార్చి 3వ తేదిన మూసివేస్తారు. తిరిగి మార్చి 3వ తేది రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మార్చి 3వ తేది మంగళవారం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అ...