భారతదేశం, మార్చి 14 -- తెలుగు ఉగాది, శ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని ఈ మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే ఆలయ దర్బారు. ప్రత్యేక పర్వదినాలలో గరుడాళ్వార్ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మూలవిరాట్, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా వేదపండితులు స్వామివారి సన్నిధిలో కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.

మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా గరుడాళ్వార్ సన్నిధిలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. దీనికి ముందు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హనుమం...