TS SSC Results 2026 : ఈ నగరానికి ఏమైంది.. తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల్లో హైదరాబాద్ లాస్ట్!
భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణలో మార్చి 2026లో జరిగిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29న అధికారికంగా వెలువడ్డాయి. ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం విశేషం. 2025లో 92.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ఈసారి 95.15 శాతానికి చేరింది.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో కూడా అమ్మాయిలే హవా కొనసాగించారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే 2.19 శాతం మెరుగైన ఫలితాలను సాధించారు. అబ్బాయిల ఉత్తీర్ణత 94.07 శాతంగా ఉంటే, అమ్మాయిలు ఏకంగా 96.26 శాతంతో సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండటం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ములుగు జిల్లా 99.30 శాతంతో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. విద్యా సదుపాయాలు తక్కువగా ఉండే మారుమూల జిల్లా ఇలా అగ్రస్థానానికి రావడం వెనుక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.