భారతదేశం, జూలై 18 -- TS DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన విద్యార్థులు.. జూలై 20, 2026 నుండి జూలై 26, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్లలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన విద్యార్థులు తమ పాత ఐడీ , పిన్ ద్వారా నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

గత విడతలలో సీటు వచ్చి. నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు...