భారతదేశం, మే 2 -- Trisha Satire On Suriya Karuppu Movie Team: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన తాజా చిత్రం 'కరుపు' టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. చిత్ర ఆడియో లాంచ్‌కు ఆమె హాజరుకాకపోవడంపై విమర్శలు వస్తున్న తరుణంలో, త్రిష ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'కరుపు' మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు.

37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్‌లో సీరియస్ లాయర్‌గా, మరో సీన్‌లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ త్రిష ఇంత యంగ్‌గా ఎలా ఉందంటూ అభిమానులు ప్రశంసల జల్లు కురిప...