భారతదేశం, ఆగస్టు 13 -- తిరుపతి (ఆంధ్రప్రదేశ్), తిరువణ్ణామలై (తమిళనాడు) నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసి విజ్ఞప్తి చేసింది.

ఎంపీలు ఎం. గురుమూర్తి (తిరుపతి), వై.ఎస్. అవినాష్ రెడ్డి (కడప), సి.ఎన్. అన్నాదురై (తిరువణ్ణామలై) సంయుక్తంగా ఈ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు. తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానించే ఈ రహదారిని అభివృద్ధి చేయడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం గణనీయంగా పుంజుకుంటుందని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు, ఈ పర్యాటక ప్రాంతాల పరిసరాల్లో వాహనాల రద్...