భారతదేశం, సెప్టెంబర్ 17 -- ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విజయవాడ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 20న(ఆదివారం) ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ వేళ తిరుమల సందర్శించే భక్తులతో పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

తిరుపతి - విజయవాడ ప్రత్యేక రైలు (రైలు నం. 07606) సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 1:15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 8:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

విజయవాడ - తిరుపతి ప్రత్యేక రైలు (రైలు నం. 07605) సెప్టెంబర్ 20న ఉదయం 9:00 గంటలకు విజయవాడ నుండి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ ట్రైన్లు రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూ...