భారతదేశం, మే 21 -- Tirumala Summer Rush 2026 : వేసవి కాలం సెలవులు కావడంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రానికి భక్తుల రాక పోటెత్తింది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తరలివస్తున్న యాత్రికుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో గురువారం నాడు ఊహించని విధంగా భక్తుల రద్దీ నెలకొంది. కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యంగా భానుడి భగభగలకు భక్తులు అల్లాడిపోకుండా ఉపశమనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు...