భారతదేశం, మార్చి 15 -- తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త మైలురాళ్లను నెలకొల్పుతోంది. ప్రసిద్ధ తిరుపతి లడ్డూ ప్రసాదం ఉత్పత్తి, అమ్మకాలను గణనీయంగా పెంచింది. ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతుండటం ద్వారా లడ్డూల తయారీని పెంచింది.

సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లకు విరుద్ధంగా.. లడ్డూ ప్రసాదానికి కొరత లేదని అధికారులు తెలిపారు. వాస్తవానికి, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రస్తుతం ప్రతిరోజూ ఏడు లక్షలకు పైగా లడ్డూలను ఉత్పత్తి చేస్తోంది.

గత ఏడాది డిసెంబర్ 28న దాదాపు 5.3 లక్షల లడ్డూల ఉత్పత్తి జరిగినప్పటికీ, టీటీడీ ప్రణాళికాబద్ధమైన విస్తరణ తర్వాత అది క్రమంగా పెరిగింది. అధికారుల ప్రకారం.. శనివారం (మార్చి 14) లడ్డూ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 8.38 లక్షలకు చేరుకుంది.

పోటు(ఆలయ వంటగది) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్...