Tirumala Garuda Seva : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - గరుడసేవ రోజు ఉదయం 3 నుంచే పుష్కరిణిలోకి అనుమతి!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Tirumala Brahmotsavam Garuda Seva : తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన గరుడసేవకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన జరగనున్న గరుడసేవ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ. ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం 3 గంటల నుంచే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సాధారణ రోజుల్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత పవిత్రంగా భావించే గరుడసేవ నాడు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఈ క్రమంలో పుష్కరిణి వద్ద భక్తుల క్యూలైన్లు పెరిగి ఎలాంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.