భారతదేశం, ఆగస్టు 27 -- Tirumala Brahmotsavam 2026 Updates : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆరోగ్యశాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏడుకొండల మీదకు వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం, సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా తిరుమల పరిధిలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత లోపిస్తే అస్సలు సహించేది లేదని స్పష్టం చేస్తూ.. ప్రతి మంగళవారాన్ని "క్లీనింగ్ డే"గా పాటించాలని ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా తిరుమలలోని పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద పారిశుధ్యం సరిగా ఉండటం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం విక్రయిస్తున్నారని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని తీవ్రంగా ప...