భారతదేశం, జూన్ 22 -- కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని రకరకాలుగా చాటుకుంటారు. స్వామి వారి సేవలతో పాటు సమాజంలో నిరుపేదలకు మేలు జరిగేలా టీటీడీ నిర్వహించే పలు ట్రస్ట్‌లకు విరాళాలు ఇస్తుంటారు. తాజాగా దరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు ఆదివారం రూ. 1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు.

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అన్నే శ్రీనివాసరావు ఈ విరాళాన్ని ఇచ్చారు. తిరుపతిలోని టీటీడీ ఈఓ క్యాంప్ కార్యాలయంలో రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూ. 1 కోటి విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను ఈఓకు స్వయంగా అందజేశారు.

తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఖరీదైన వైద్య...