భారతదేశం, ఆగస్టు 28 -- Tirumala Brahmotsavams 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ' నేడు అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

శుక్రవారం(ఇవాళ) రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీ మలయప్పస్వామివారు తన అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనభాగ్యం కల్పిస్తారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగానే ఈ మాదిరి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్రధాన ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు, భద్రత, రద్దీ నియంత్రణ వంటి అంశా...