భారతదేశం, ఏప్రిల్ 23 -- SV Museum in Tirumala : తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు శ్రీవారి వైభవాన్ని, ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో కళ్లకు కట్టేలా చూపేందుకు టీటీడీ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియాన్ని అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో టీటీడీ పునర్నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు ఇదొక ఆధ్యాత్మిక, విజ్ఞానదాయకమైన అద్భుత అనుభూతిని అందించనుంది.

తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ...