భారతదేశం, మే 30 -- Telangana Weather Advisory Program : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంతో పాటు ముందస్తు సమాచారాన్ని చేరవేయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా "తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు.

తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలైన 'డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా' (DIL India), 'ఎవిడెన్స్ యాక్షన్' (Evidence Action) ల భాగస్వామ్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, సదరు సంస్థల ప్రతినిధుల మధ్య తదుపరి కార్యాచరణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

న్యూఢిల్లీ నుంచి జూమ్ (Zoom) వీడియో కాన్ఫరెన్స్ ...