భారతదేశం, జూలై 28 -- టీజీ టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్ అయింది. ఇది జూలై 30 తేదీ వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సమర్పణకు చివరి గడువు జూలై 29గానే ఉంటుంది. డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో 'ఎడిట్' అప్లికేషన్ సేవను ప్రారంభించినట్లు SCERT ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర చరిత్రలోనే ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం ఇదే తొలిసారి.

దరఖాస్తుల సమర్పణ జులై 22 నుంచి జులై 29 వరకు ఉండనుంది. ఆగస్టు 31 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 11 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్: 9.00 AM నుంచి 11.30 AM వరకు మధ్యాహ్నం సెషన్: 2.00 PM నుంచి 4.30 PM వరకు ఉంటుంది. సెప్టెంబరు 28 నుంచి 30 మధ...