భారతదేశం, జూన్ 23 -- రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ - 2026) జూన్ సెషన్ పరీక్షలు ముగిశాయి. సోమవారంతో ఈ ఆన్‌లైన్ పరీక్షల ప్రక్రియ అంతా పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74.81 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

గణాంకాలను పరిశీలిస్తే.. పేపర్-1తో పాటు పేపర్-2లోని సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మిగిలిన వారు గైర్హాజరయ్యారు. జూన్ 16, 17, 18, 19, అలాగే 22వ తేదీల్లో వివిధ సెషన్లలో ఈ పరీక్షలను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) పద్ధతిలో పూర్తి చేశారు.

టీజీ టెట్ పరీక్షలు ముగియడంతో ప్రాథమిక కీల విడుదలపై అధిక...