భారతదేశం, ఏప్రిల్ 8 -- తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గతేడాదికి భిన్నంగా ఈసారి షెడ్యూల్ ఉండగా. విద్యార్థులకు చాలా సమయం ఇచ్చారు. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఫలితంగా నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి.

గత మార్చి 14వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 7వ తేదీన బయాలజీ పేపర్ పూర్తి అయింది. మిగతా సబ్జెక్టులన్నీ కలిపి ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి.

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా. ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అనుకుంటే. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపుతుంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ ...