భారతదేశం, మార్చి 11 -- పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే పరీక్షలకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.

గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉంటుందని పరీక్షల విభాగం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. గత ఏడాది ఆన్సర్ షీటుకు ఓఎంఆర్ షీట్ జత చేసి విద్యార్థులకు అందజేశారు. ఈసారి కూడా అదే మాదిరిగానే ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు.. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఓఎంఆర్ ఫార్మాట్‌పై విద్యార్థులకు అవగాహన పెంచుకోవడానికి వీలుగా నమూనా కాపీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.విద్యార్థులు www.bse.telangana.gov.in మరియు ...